సినిమా విడుదలకే కాదు వాటిని ప్రచారం చేసేందుకు పండగలు నెలవుగా మారతాయి దర్శకనిర్మాతలకు. అందుకే కొందరు థియేటర్లలలో సందడి చేస్తే, మరికొందరు సామాజిక మాధ్యమాల వేదికగా విడుదలకు సిద్ధమయ్యే చిత్రాల ఫస్ట్లుక్, టీజర్, ట్రైలర్లు చూపిస్తారు. సాయి పల్లవి కూడా పండగ పూట అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వనుందని టాలీవుడ్ టాక్.
అదేంటంటే? శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్యతో కలిసి సాయిపల్లవి ఓ చిత్రం చేస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. 'లవ్స్టోరీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులోని పల్లవి ఫస్ట్లుక్ను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తోందట చిత్రబృందం. ఇప్పటికే విడుదలైన చైతూ లుక్ ఆకట్టుకుంది.