తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామోజీ ఫిల్మ్​సిటీలో సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్​

సాహో చిత్ర విడుదల ముందస్తు వేడుక ఆగస్టు 18న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్​సిటీ వేదిక కానుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

By

Published : Aug 14, 2019, 12:58 PM IST

Updated : Sep 26, 2019, 11:38 PM IST

సాహో

సాహో విడుదల దగ్గరపడుతున్న కొద్ది ప్రచార వేగాన్ని పెంచింది చిత్రబృందం. ఇప్పటికే ముంబయి, హైదరాబాద్​ సహా పలు నగరాల్లో విస్తృతంగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు ప్రభాస్, శ్రద్ధాకపూర్. తాజాగా చిత్ర విడుదల ముందస్తు వేడుకను ఆగస్టు 18న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్​ రామోజీ ఫిల్మ్​సిటీ వేదిక కానుంది. సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుంది.

సాహో చిత్రపోస్టర్​

సాహో ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు హీరోహీరోయిన్లు సహా చిత్రప్రముఖులు హాజరు కానున్నారు. ఇప్పటికే సాహో వీడియో గేమ్ టీజర్​నూ విడుదల చేసింది చిత్రబృందం. ఈ గేమ్​ను గురువారం ఆవిష్కరించనున్నారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై వంశీ - ప్రమోద్ నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు 300కోట్లకు పైగా తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇది చదవండి: తమిళ ‘జెర్సీ’లో విశాల్, అమలాపాల్​..?

Last Updated : Sep 26, 2019, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details