తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రొమాంటిక్​ మూడ్​లో 'సాహో' జోడి

సాహోలో 'బేబీ వోంట్​ యూ టెల్​ మీ' అంటూ సాగే రొమాంటిక్ గీతాన్ని.. సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు హీరో ప్రభాస్. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

By

Published : Aug 26, 2019, 2:25 PM IST

Updated : Sep 28, 2019, 7:54 AM IST

సాహో పోస్టర్

టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన భారీ బడ్జెట్​ చిత్రం ‘సాహో’. ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం. అయితే తన అభిమానులకు సోషల్‌మీడియా ద్వారా సోమవారం ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు డార్లింగ్ హీరో. చిత్రంలోని 'బేబీ వోంట్​ యూ టెల్ మీ' అంటూ సాగే గీతాన్ని ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు.

దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ను రూపొందించారు. ఇందులో రూ.2 వేల కోట్ల దోపిడీకి సంబంధించిన కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ప్రభాస్‌ కనిపించనున్నాడు. ఈ సినిమాతో శ్రద్ధాకపూర్‌ తెలుగు తెరకు పరిచయమవుతోంది. బాలీవుడ్‌ తార జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఓ ప్రత్యేక గీతంలో అలరించనుంది.

జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ, మహేశ్​ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: చిరంజీవి సినిమాలోని సీన్ నాని చిత్రంలో కాపీ!

Last Updated : Sep 28, 2019, 7:54 AM IST

ABOUT THE AUTHOR

...view details