తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జబర్దస్త్​ టీమ్​కు రోజా ప్రత్యేక కానుక

తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన జబర్దస్త్​ షోలో నటిస్తోన్న సభ్యులకు ఎమ్మెల్యే రోజా ఓ కానుక అందించారు. 'శ్రీపూర్ణిమ' అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు.

By

Published : Oct 10, 2019, 5:46 AM IST

Updated : Oct 10, 2019, 7:41 AM IST

రోజా

జబర్దస్త్​.. ఈ షో​ తెలియని తెలుగు లోగిళ్లు.. ఇది చూడని యువత లేరంటే అతిశయోక్తి కాదేమో! రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం సంపాదించిందీ షో. ఈ కార్యక్రమానికి జడ్జిగా ఉన్న ఎమ్మెల్యే రోజా జబర్దస్త్​సభ్యులకు ఓ కానుక ఇచ్చారు.

జబర్దస్త్​ టీమ్​కు రోజా ప్రత్యేక కానుక

దసరా సందర్భంగా హైపర్ ఆది, చలాకి చంటి, దొరబాబు తదితరులకు 'శ్రీపూర్ణిమ' అనే భక్తి గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు రోజా. ఈ గ్రంథాన్ని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రాశారు. ఈ పుస్తకాన్ని ఇచ్చినందకు రోజాకు ధన్యవాదాలు చెప్పింది జబర్దస్త్​ టీమ్.

అమ్మవారి అనుగ్రహంతో ఈ పుస్తకం ఇస్తున్నానని, ప్రార్ధనా వేళల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు రోజా. ఇప్పటికే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఈ పుస్తకానికి ఆదరణ పెరుగుతోందని తెలిపారు.

ఇదీ చదవండి: భూతవైద్యుడు షూటింగ్ ప్రారంభించాడు..!

Last Updated : Oct 10, 2019, 7:41 AM IST

ABOUT THE AUTHOR

...view details