కరోనా లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇలాంటి సమయంలోనూ 'మిర్చి' నటి రిచా గంగోపాధ్యాయ మాత్రం తన భర్తతో కలిసి పిక్నిక్కి వెళ్లింది. గతేడాది అమెరికాకి చెందిన తన సహాధ్యాయి జో లాంగెల్లాను పెళ్లి చేసుకుందీ అందాల భామ.
పిక్నిక్కు వెళ్లిన జంట
కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ ఉన్నారట రిచా. అక్కడ ఒక్కో సమయంలో ఏదైనా అత్యవసర సామగ్రిని కొనుగోలుకు మాత్రమే బయటకు వచ్చేవాళ్లట. అయితే తాజాగా రిచా తన భర్తతో కలిసి దగ్గరగా ఉన్న ఒరెగాన్ నదికి వెళ్లిందట. అయినా ఇద్దరూ భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఉన్నారట. ఇదే విషయాన్ని రిచా భర్త తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.