తెలంగాణ

telangana

ఈ బంగాలీ 'బేబీ' గాత్రానికి నెటిజన్లు ఫిదా..!

By

Published : Aug 24, 2019, 7:18 PM IST

Updated : Sep 28, 2019, 3:40 AM IST

పల్లె కోయిల బేబీ గుర్తుందా...? తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పల్లెటూరు నుంచి వచ్చిన ఆమె.. కేవలం ఒక్క రోజులోనే సోషల్​ మీడియా స్టార్​గా మారిపోయింది. సంగీత ప్రియులు తన గాత్రానికి మైమరచిపోవడమే కాదు ఆశ్చర్యపోయారు. ఒక్క ముక్క చదువురాని ఆమె.. ఇంత చక్కగా పాడుతుందా అని అబ్బురపడ్డారు. ఇదే తరహాలో బంగాల్​కు చెందిన రేణూ మోండల్​ అందరి దృష్టిని ఆకర్షించింది. రణఘాట్​ రైల్వేస్టేషన్​లో పాటలు పాడే ఆమె... ఇప్పుడు బాలీవుడ్​లో గాయనిగా మారిపోయింది.

ఈ హిందీ బేబీ గాత్రానికి నెటిజన్లు ఫిదా..!

ఆమెను చూస్తే చింపిరి జట్టు.. తినడానికి తిండి లేక బాధపడుతున్న నిరుపేద మహిళగా కనిపిస్తుంది. కాని స్వరం మాత్రం ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్​ను గుర్తు చేస్తుంది. బంగాల్​లోని రణఘాట్​ రైల్వేస్టేషన్​లో పాటలు పాడుకుంటూ తిరిగే ఆమె పేరే... రేణూ మోండల్​.

ప్లాట్​ఫామ్​పై 'ఏక్‌ ప్యార్‌ కా నగ్మా హై' అనే పాట పాడుతుండగా... ఆ వినసొంపైన గాత్రానికి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆమె పాటను వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇంకేముంది ఆ మహిళ పాట... స్థానికులతోపాటు నెటిజన్ల మనసునూ గెలుచుకుంది.

రేణు పాట విన్న ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేశ్‌ రేష్మియా.. తను తీస్తున్న సినిమాలో ఆమెకు పాట పాడే అవకాశం కల్పించాడు. రికార్డింగ్​ థియేటర్​లో రేణు పాడుతున్నప్పుడు తీసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

" నా సినిమా కోసం ప్రతిభావంతురాలైన రేణూ మోండల్‌ చేత పాట పాడించా. కన్న కలలను సాకారం చేసుకోవాలన్న ధైర్యం, సానుకూల ధృక్పథం ఉంటే చాలు. కచ్చితంగా వాటిని నిజం చేసుకోగలం".

-హిమేశ్​ రేష్మియా, బాలీవుడ్​ సింగర్​

రైల్వే స్టేషన్​లోని కచేరీ బాలీవుడ్​ సినిమా 'హ్యాపీ హార్డి అండ్​ హీర్​'లో అవకాశం తెచ్చిపెట్టిందని... మంచి సింగర్​గా మరింత పేరు తెచ్చుకోవాలని నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి...బోల్డ్ పాత్రలో రాశి.. కొత్త చిత్రం షురూ

Last Updated : Sep 28, 2019, 3:40 AM IST

ABOUT THE AUTHOR

...view details