ఆమెను చూస్తే చింపిరి జట్టు.. తినడానికి తిండి లేక బాధపడుతున్న నిరుపేద మహిళగా కనిపిస్తుంది. కాని స్వరం మాత్రం ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ను గుర్తు చేస్తుంది. బంగాల్లోని రణఘాట్ రైల్వేస్టేషన్లో పాటలు పాడుకుంటూ తిరిగే ఆమె పేరే... రేణూ మోండల్.
ప్లాట్ఫామ్పై 'ఏక్ ప్యార్ కా నగ్మా హై' అనే పాట పాడుతుండగా... ఆ వినసొంపైన గాత్రానికి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఆమె పాటను వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ మహిళ పాట... స్థానికులతోపాటు నెటిజన్ల మనసునూ గెలుచుకుంది.
రేణు పాట విన్న ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు హిమేశ్ రేష్మియా.. తను తీస్తున్న సినిమాలో ఆమెకు పాట పాడే అవకాశం కల్పించాడు. రికార్డింగ్ థియేటర్లో రేణు పాడుతున్నప్పుడు తీసిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు.