తెలంగాణ

telangana

లోకనాయకుడిని వరించిన 'గౌరవ డాక్టరేట్​'

By

Published : Nov 19, 2019, 5:40 PM IST

ప్రముఖ హీరో కమల్​హాసన్​కు మరో గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఒడిశా విశ్వవిద్యాలయం ఈ నటుడికి గౌరవ డాక్టరేట్​ను అందించింది. అనంతరం లోకనాయకుడు కమల్​హాసన్​కు అభినందనలు తెలిపారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్.

లోకనాయకుడిని వరించిన డాక్టరేట్​

ప్రముఖ నటుడు, రాజకీయ వేత్త కమల్​హాసన్​ను గౌరవ డాక్టరేట్ వరించింది. సెంచూరియన్​ యూనివర్శిటీ ఆఫ్​ టెక్నాలజీ అండ్ మేనేజ్​మెంట్​ నుంచి పురస్కారం లభించింది. ఈ సందర్భంగా ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్​ పట్నాయక్​... కమల్​హాసన్​ను ఆయన నివాసానికి ఆహ్వానించి అభినందలు తెలిపారు. అనంతరం మక్కల్ నీది మయ్యం పార్టీ, తమిళ రాజకీయ పరిణామాల గురించి చర్చించారు.

లోకనాయకుడిని వరించిన 'గౌరవ డాక్టరేట్​'

" సినీ దిగ్గజం​ కమల్​హాసన్​ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి సినిమా, కళలు, రాజకీయ అంశాలపై కాసేపు మాట్లాడుకున్నాం. ప్రకృతి సౌందర్యం, స్మారక చిహ్నాలు, వారసత్వ సంపదను చూసేందుకు ఒడిశా రమ్మని కమల్​హాసన్​ను ఆహ్వానించాను."

-నవీన్ పట్నాయక్​, ఒడిశా ముఖ్య మంత్రి

1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్​గా 'భారతీయుడు 2' చిత్రం తెరకెక్కుతోంది. కమల్​కు జోడీగా కాజల్​ నటిస్తోంది. ఈ సినిమాకు ఎస్​. శంకర్​ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవి కూడా చూడండి: రాహుల్-పునర్నవికి అభిమానులు పెట్టిన ముద్దుపేర్లు

ABOUT THE AUTHOR

...view details