తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనా టెస్టుకు సీనియర్ నటి ససేమిరా! - actress rekha news

సీనియర్​ నటి రేఖ.. కొవిడ్-19 టెస్టు చేయించుకోవడానికి నిరాకరిస్తున్నట్లు ముంబయి మున్సిపల్​ అధికారులు తెలిపారు. ఇటీవలే తన ఇంటిలో పనిచేసే సెక్యూరిటీ గార్డుకు కరోనా పాటిజివ్​గా నిర్ధరణ అయింది. ఇప్పటికే బాంద్రాలోని ఆమె బంగ్లాను సీజ్​ చేయగా.. ఆ ప్రాంతంలో శానిటైజ్​ చేసేందుకు రేఖ ఒప్పుకోవట్లేదని బృహన్ ​ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​(బీఎంసీ) స్పష్టం చేసింది.

Rekha unwilling to get tested for COVID-19
కరోనా టెస్టు చేయించుకోనని మారాం చేస్తున్న నటి రేఖ

By

Published : Jul 15, 2020, 1:30 PM IST

Updated : Jul 15, 2020, 3:59 PM IST

భారత్​లో తీవ్రమైన కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది మహారాష్ట్ర. అయితే ముంబయిలోని బాంద్రాలో సీనియర్​ నటి రేఖ నివాస ప్రాంతం 'సీ స్ప్రింగ్స్' ప్రస్తుతం కంటైన్​మెంట్​ జోన్​గా మారింది. అయితే తన బంగ్లాలోని ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా రావడం వల్ల.. రేఖకు పరీక్షకు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే అందుకు నటి తిరస్కరించినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు.

తను ఎవరితోనూ కాంటాక్ట్​ అవలేదని, టెస్టు అవసరం లేదని పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా తన ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్​కు ఆమె అంగీకరించట్లేదని మున్సిపల్​ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

నటి రేఖ

ఇప్పటికే రేఖ ఇంటి సమీపంలోనూ చాలా కంటైన్మెంట్ జోన్లు ఉండగా.. వాటన్నింటినీ అధికారులు శానిటైజ్​ చేశారు. అయితే చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన ఆమె.. టెస్టు చేయించుకుందా? లేదా అనేది తేలలేదు. అయితే ఇప్పటికే రేఖ సమీప బంగ్లాల్లోని నలుగురు సెక్యూరిటీ సిబ్బంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.

ఇటీవలే బిగ్​ బీ అమితాబ్​ ఫ్యామిలీ మొత్తం కరోనా టెస్టులు చేయించుకుంది. అమితాబ్, అభిషేక్​.. నానావతి ఆసుపత్రిలో జులై 11 నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మిగిలిన వారంతా హోం​ క్వారంటైన్​లో ఉన్నారు.

Last Updated : Jul 15, 2020, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details