తెలంగాణ

telangana

By

Published : Aug 23, 2019, 7:40 PM IST

Updated : Sep 28, 2019, 12:44 AM IST

ETV Bharat / sitara

'నన్ను ట్రోల్​ చేయండి.. నాపై మీమ్స్ వేయండి'

'ఎవరు' సక్సెస్​ మీట్​లో హీరోయిన్​ రెజీనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనపై వస్తున్న మీమ్స్, ట్రోల్స్​ చాలా బాగున్నాయని చెప్పింది. ఇంకా ఇంకా చేయాలని నెటిజన్లను కోరింది.

హీరోయిన్​ రెజీనా

'ఎవరు' సక్సెస్​ మీట్​లో రెజీనా స్పందన

తనను ఇంకా ట్రోల్ చేయాలని, తనపై సరికొత్త మీమ్స్‌ వేయాలని అంటోంది హీరోయిన్​ రెజీనా. ఆమెకు అడిగి మరీ అనిపించుకోవాల్సిన అవసరమేంటి అనుకోకండి. ఎందుకంటే ప్రస్తుతం తనపై వస్తున్న ట్రోల్స్‌ అన్నీ చాలా సరదాగా ఉంటున్నాయని, ‘ఎవరు’లోని తన పాత్రతో తయారు చేస్తున్న హాస్యభరిత మీమ్స్‌ ఎంతో కొత్తగా ఉన్నాయని సంబరపడిపోతుందీ భామ. హైదరాబాద్​లో శుక్రవారం జరిగిన 'ఎవరు' సక్సెస్​ మీట్​లో ఈ విషయాల్ని పంచుకుంది.

సస్పెన్స్​ థ్రిల్లర్​గా​ రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్​ వద్ద హిట్​గా నిలిచింది. ప్రధాన పాత్రల్లో నటించిన అడివి శేష్, నవీన్​ చంద్ర, రెజీనా.. అద్భుత నటనతో అలరించారు. దర్శకుడు వెంకట్​ రాంజీ తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు.

ఇది చదవండి: అడివి శేష్​కు నిర్మాత దిల్​రాజు బంపర్ ఆఫర్

Last Updated : Sep 28, 2019, 12:44 AM IST

ABOUT THE AUTHOR

...view details