తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పాన్ ఇండియాపై కన్నేసిన రష్మిక! - రష్మిక సిద్ధార్థ్ మల్హోత్రా

టాలీవుడ్, బాలీవుడ్​లో వరుస చిత్రాలతో దూసుకుపోతోంది హీరోయిన్ రష్మిక. ఇదివరకే పలు చిత్రాలు సెట్స్​పై ఉండగా.. మరికొన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది.

Rashmika busy with back to back movies
వరుస చిత్రాలతో బిజీబిజీ

By

Published : Jan 9, 2021, 7:12 AM IST

పాన్‌ ఇండియా గుర్తింపుని సొంతం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది బ్యూటీక్వీన్ రష్మిక. ఇప్పటికే దక్షిణాదిలో ఆమె అగ్రనాయికగా కొనసాగుతోంది. ఇప్పుడు హిందీలోకీ అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ.

'మిషన్‌ మజ్ను' పేరుతో రూపొందుతున్న సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటిస్తోంది. ఆ సినిమా చిత్రీకరణ శుక్రవారమే మొదలైంది. కథానాయకుడితో కలిసి బైక్‌పై దూసుకెళుతున్న‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. దీంతో పాటు బిగ్​బీ అమితాబ్​తోనూ ఓ చిత్రం చేయనుంది రష్మిక.

రష్మిక చిత్రాలు

తెలుగులోనూ ఆమె వరుసగా సినిమాలకు పచ్చజెండా ఊపుతోంది. ఇప్పటికే స్టైలిష్​ స్టార్​ అల్లు అర్జున్​ 'పుష్ప' కోసం రంగంలోకి దిగిన రష్మిక, తదుపరి శర్వానంద్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతోంది. తమిళంలోనూ అరంగేట్రం చేస్తోందీ బ్యూటీ. కార్తీ నటిస్తున్న 'సుల్తాన్​' చిత్రంలో మెరవనుంది.

రష్మిక

అన్నీ కుదిరితే ఆమె నాగచైతన్యతోనూ కలిసి వరుసగా రెండు సినిమాలు చేసే అవకాశాలున్నాయి. నాగచైతన్య 'థ్యాంక్యూ'లో ముగ్గురు నాయికలకి చోటుంది. అందులో ఓ నాయికగా రష్మికని ఎంపిక చేసుకునే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. అలాగే చైతన్యతోనే మోహనకృష్ణ ఇంద్రగంటి ఓ చిత్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అందులో నాయికగా రష్మికని ఎంపిక చేసుకోవాలని ముందుగానే నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇదీ చూడండి:'ఇష్క్' తెలుగులో మరోసారి.. పాటతో వచ్చిన అల్లుడు

ABOUT THE AUTHOR

...view details