టాలీవుడ్ యువ కథానాయకుడు రానా దగ్గుబాటి తదుపరి చిత్రం 'విరాటపర్వం' పట్టాలెక్కేందుకు రంగం సిద్ధమైంది. రానా సరసనహీరోయిన్గా సాయి పల్లవి నటించనుంది.ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్ ముహూర్త వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి షూటింగ్కు పచ్చజెండా ఊపారు వెంకీ. గొట్టిపాటి రవి కెమెరా స్విచ్ ఆన్ చేశాడు.
విక్టరీ క్లాప్తో రానా 'విరాటపర్వం' మొదలు - SaiPallavi
'బాహుబలి' సిరీస్లో ప్రతినాయకుడిగా నటించి... విమర్శకుల మన్ననలు పొందిన యంగ్ హీరో రానా తదుపరి చిత్రం ప్రారంభమైంది. సాయి పల్లవితో కలిసి రొమాన్స్ చేయనున్న 'విరాటపర్వం' చిత్రీకరణ హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది.
రానా 'విరాటపర్వం' మొదలైంది
ఈ చిత్రానికి 'నీదీ నాదీ ఒకటే కథ' ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్, ఎస్ఎస్వీ సినిమాస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రానికి... సురేశ్ప్రభు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇదీ చూడండి : సాహోలో ఒక్క ఛేజ్ సీన్ కోసం 90 కోట్లు..!