తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2021, 7:37 AM IST

ETV Bharat / sitara

ఆ సినిమా కోసం గాయకుడిగా మారిన రానా!

ఇప్పటికే తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న దగ్గుబాటి వారసుడు రానా.. త్వరలోనే తనలోని మరో టాలెంట్​ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారని తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న 'విరాటపర్వం' చిత్రంలో ఓ పాటను తానే(Rana Daggubati Movies) స్వయంగా పాడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Rana Daggubati
రానా

'లీడర్', 'బాహుబలి', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు రానా దగ్గుబాటి(Rana Daggubati Movies). ఆయన హీరోగా నటిస్తున్న మరోచిత్రం 'విరాటపర్వం' కోసం తొలిసారి ఆయన గాత్రం వినిపించనున్నాడు. ఈ చిత్రంలోని ఓ ఆలోజింపచేసే పాటను పాడేందుకు రానా సిద్ధమవుతున్నారని టాలీవుడ్​లో టాక్ వినిపిస్తోంది. ఈ పాటను వచ్చేవారం రికార్డింగ్​ చేయనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన 'విరాటపర్వం' సినిమాలో(Virata Parvam Release Date) రానా సరసన సాయిపల్లవి హీరోయిన్​గా నటించగా.. ప్రియమణి కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. 2021 ఏప్రిల్​లోనే ఈ చిత్రం విడుదల కావాల్సిఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది.

.

పవన్​తో మల్టీస్టారర్​

మల్టీస్టారర్​గా తెరకెక్కుతున్న 'భీమ్లానాయక్' చిత్రంలో డేనియల్​ శేఖర్​గా రానా నటిస్తున్నాడు. ఆయన పాత్రకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్​ప్లే అందిస్తున్న ఈ మూవీకి సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్​ఎస్​ తమన్​ స్వరాలను సమకూరుస్తున్నాడు.

మరోవైపు బాబాయ్ వెంకటేశ్​తో కలిసి ఓ వెబ్​సిరీస్​లోనూ నటించనున్నాడు రానా. పాపులర్ అమెరికన్ డ్రామా సిరీస్​ 'రే డోనోవాన్​'ను 'రానా నాయుడు' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:వెంకటేశ్ షాకింగ్ లుక్.. రానాతో కలిసి వెబ్ సిరీస్

ABOUT THE AUTHOR

...view details