భళ్లాలదేవుడు రానా.. తెలుగులో ప్రస్తుతం 'విరాటపర్వం' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను కేరళలోని మలయత్తూర్లో తీస్తున్నారు. ఇతడితో పాటు కథానాయిక సాయిపల్లవి షూటింగ్లో పాల్గొంది. త్వరలో విడుదల తేదీపై చిత్రబృందం స్పష్టతనివ్వనుంది.
కేరళ అడవుల్లో రానాతో సాయిపల్లవి - Virata Parvam in Kerala forest
విరాటపర్వం సినిమా షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఇందులో సాయిపల్లవి నక్సలైట్గా కనిపిస్తుండటం వల్ల ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

హీరో రానా
1992లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. ఇందులో సాయిపల్లవి నక్సలైట్గా, రానా పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. వీరితో పాటే టబు, ప్రియమణి, నందితా దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. సురేశ్బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.