మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత మలయాళ సినిమా 'లూసిఫర్' తెలుగు రీమేక్ పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ దీనిని తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొచ్చింది.
ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటించనుందని టాక్. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చలు జరపగా.. సుముఖత చూపారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.