తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆఫ్రికా సఫారీల్లో విహరిస్తున్న మెగా కపుల్​ - సెరెంగెటి జాతీయ పార్కు

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​, ఆయన భార్య ఉపాసన కలిసి ఆఫ్రికాలో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా అక్కడ దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఆఫ్రికా సఫారీలో మెగా కపుల్​

By

Published : May 30, 2019, 12:34 PM IST

టాలీవుడ్​ హీరో​ రామ్​ చరణ్, ఉపాసన జంట ఆఫ్రికాలోని టాంజానియాలో విహరిస్తున్నారు. అక్కడ సెరెంగెటి జాతీయ పార్కులో తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు.

సెరెంగెటి జాతీయ పార్కులో పులులు

జూన్​ 14న ఏడో వివాహ వార్షికోత్సవం చేసుకోనున్నారీ దంపతులు. అదే సమయంలో ఆర్​ఆర్​ఆర్​ చిత్రీకరణ తిరిగి ప్రారంభంకానుంది. దీని వల్లే ఈ జంట ముందుగా టూర్​ ప్లాన్​ చేసుకున్నట్లు తెలుస్తోంది.

కెమోరాతో అందాలను బంధిస్తున్న చరణ్​

రామ్​చరణ్ కాలి గాయం కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామ్​చరణ్​, ఎన్టీఆర్ కాంబినేషన్​లో​ మల్టీస్టారర్‌గా రూపొందుతోంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్​తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో రామ్​చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్​, సముద్రఖని లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2020 జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details