తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రిస్మస్​ వేడుకల్లో 'మెగా' కజిన్స్

హీరో రామ్​చరణ్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలోని కజిన్లు అందరూ సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

By

Published : Dec 25, 2020, 12:19 PM IST

ram charan host christmas party for mega cousins
క్రిస్మస్​ 'మెగా' సందడి... కజిన్లంతా ఒకే చోట!

ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా మెగా ఫ్యామిలీ.. క్రిస్మస్​ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. కజిన్స్ అందరూ కలిసి సీక్రెట్​ శాంటా ఆడారు. రామ్​ చరణ్​, ఉపాసన ఈ ఈవెంట్​కు ఆతిథ్యమివ్వగా.. వేడుకల్లో అల్లు అర్జున్​, వరుణ్​ తేజ్​, సాయి తేజ్​, శిరీష్, వైష్ణవ్​ తేజ్​తో పాటు నూతన దంపతులు నిహారిక-చైతన్య కూడా పాల్గొన్నారు. ఆ ఫొటోను అల్లు శిరీష్ ట్వీట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అలానే అభిమానులందరికీ క్రిస్మస్​ శుభాకాంక్షలు చెప్పారు​. అద్భుత ఆతిథ్యమిచ్చిన చరణ్​, ఉపాసనకు కృతజ్ఞతలు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details