తెలంగాణ

telangana

By

Published : Dec 26, 2021, 11:10 AM IST

ETV Bharat / sitara

మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సంబరాలు.. ఫొటోలు వైరల్

Mega Family Christmas: మెగా ఫ్యామిలీలో ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా పవర్​స్టార్ రామ్​ చరణ్ ఈ వేడుకకు ఆతిథ్యమిచ్చారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్​ సహా అల్లు, మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు.

mega family christmas celebration
మెగా ఫ్యామిలీ

Mega Family Christmas: మెగా ఫ్యామిలీలో క్రిస్మస్​ సంబరాలు సందడిగా జరిగాయి. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా రామ్​ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ సహా మెగా కుటుంబ సభ్యులందరూ ఒక్క చోటుకు చేరి పండగను ఘనంగా నిర్వహించారు. ఉపాసన-చరణ్ దంపతులు ఈ వేడుకకు ఆతిథ్య మిచ్చారు.

ఉపాసన-చరణ్ దంపతులు

క్రిస్మస్ వేడుకలకు హాజరైనవారిలో సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక దంపతులు, బన్నీ సతీమణి స్నేహ రెడ్డి తదితర కుటుంబ సభ్యులున్నారు. పండుగ ఏదైనా ఒక్కచోట చేరి కలిసికట్టుగా వేడుకలు చేసుకోవడం మెగా ఫ్యామిలీకి అలవాటే.

క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ

ఇటీవలే విడుదలైన 'పుష్ప' పాజిటివ్​ టాక్​తో దూసుకుపోవడం, 'ఆర్​ఆర్​ఆర్'​ రిలీజ్​కు సిద్ధంగా ఉండటం వల్ల రెట్టింపు ఉత్సాహంతో పండుగను సెలబ్రేట్​ చేసుకున్నారు అల్లు-మెగా వారసులు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫొటోను స్నేహ రెడ్డి షేర్​ చేయగా.. అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తల్లితో వరుణ్

ఇదీ చూడండి:క్రిస్మస్ పార్టీ మూడ్​లో అందాల భామలు!

ABOUT THE AUTHOR

...view details