హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakulpreet Singh) దృష్టంతా బాలీవుడ్పైనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న చిత్రాలన్నీ హిందీవే. వీటిలో 'మేడే', 'థ్యాంక్ గాడ్', 'డాక్టర్ జి', 'ఛత్రివాలి' లాంటి చిత్రాలున్నాయి. అయితే ఇప్పుడీ జాబితాలోకి మరో కొత్త సినిమా చేరినట్లు బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
తమిళంలో విజయవంతమైన 'రాట్ససన్'(తెలుగులో రాక్షసుడు) చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు నటుడు అక్షయ్ కుమార్(Askhay kumar). రంజిత్ తివారి దర్శకుడు. అక్షయ్, జాకీ భగ్నాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పుడీ సినిమా కోసం అక్షయ్ కుమార్కు జోడీగా రకుల్ను ఎంపిక చేసినట్లు సమాచారం. నిజానికి ఈ పాత్ర కోసం తొలుత కియారా అడ్వాణీ, శ్రద్ధా కపూర్ లాంటి వారి పేర్లు వినిపించినా.. చిత్ర బృందం రకుల్ వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు నుంచి సినిమా సెట్స్పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
షూటింగ్లతో బిజీ