తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇద్దరి లోకం ఒకటే' విడుదల తేదీ ఖరారు - rajtarun latest news

యంగ్​ హీరో రాజ్​ తరుణ్​ హీరోగా నటించిన 'ఇద్దరి లోకం ఒకటే' సినిమా విడుదల తేదీ ఖారారు అయ్యింది. నవంబర్​ 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'ఇద్దరి లోకం ఒకటే' విడుదల తేదీ ఖరారు

By

Published : Oct 23, 2019, 9:16 PM IST


యంగ్ హీరో రాజ్‌ 'తరుణ్‌' హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం '‘ఇద్దరి లోకం ఒకటే'’. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా తాజాగా రిలీజ్ డేట్​ను ఫిక్స్ చేసుకుంది. న‌వంబ‌ర్ 9న ఈ సినిమా విడుద‌ల కానుందని ద‌ర్శ‌క నిర్మాత‌లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన 'షాలినీ పాండే' హీరోయిన్​గా నటిస్తోంది. కొద్ది కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడీ హీరో. గతేడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా.. ఒక్క సినిమాతో కూడా ఆకట్టుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో.

ప్రస్తుతం '‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’' ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఒరేయ్.. బుజ్జిగా’ సినిమాలో నటిస్తున్నాడు.

ఇదీ చూడండి : బిగ్​ బీ అమితాబ్ నటుడు కాకపోయుంటే!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details