తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మలేసియా చిత్రోత్సవ జ్యూరీ సారథిగా భారతీయుడు

మలేసియా గోల్డెన్​ గ్లోబల్​ అవార్డుల కమిటీ జ్యూరీకి అధ్యక్షుడిగా నియామితుడయ్యాడు బాలీవుడ్ దర్శకుడు రాజ్​కుమార్ హిరాణీ. జులై 20న అమెరికా లాస్​ఏంజెల్స్​లో ఈ కార్యక్రమం జరగనుంది.

By

Published : May 14, 2019, 3:23 PM IST

హిరాణీ

బాలీవుడ్ దర్శకుడు రాజ్​కుమార్ హిరాణీ మలేసియా గోల్డెన్ గ్లోబల్ అవార్డుల జ్యూరీకి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. దక్షిణ కొరియా సినిమాటోగ్రఫర్​ కిమ్​ హ్యాంగ్​, నటుడు సిసిలియా, దర్శకుడు అన్వర్​తో కూడిన జ్యూరీ సభ్యులతో కలవనున్నాడు హిరాణీ.

2017లో మొదటి సారి మలేసియా అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్(ఎమ్​ఐఎఫ్​ఎఫ్​) జరిగింది. ప్రస్తుతం మూడో సీజన్​ జులై 14 నుంచి 19 వరకు అమెరికా లాస్​ఏంజిల్స్​లో జరగనుంది. జులై 20న ఎమ్​ఐఎఫ్​ఎఫ్​ అధ్వర్యంలో మలేసియా గోల్డెన్​ గ్లోబల్​ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభం కానుంది.

మలేసియా వాసుల ప్రతిభను అంతర్జాతీయంగా వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎమ్​ఐఎఫ్​ఎఫ్​ మంచి వేదిక అవుతుందని ఎమ్​ఐఎఫ్​ఎఫ్​ ఛైర్మన్ జోవానా గో తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details