తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2020, 8:10 PM IST

ETV Bharat / sitara

జయరాజ్ కుటుంబంతో రజనీ ఫోన్ సంభాషణ

పోలీసుల హింసాత్మక చర్యలకు తమిళనాడులో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనతో.. సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్​స్టార్​ రజనీకాంత్​ బాధితుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.

Rajinikanth condoles death of father-son duo in Tuticorin
జయరాజ్ భార్యకు ఫోన్​ చేసిన రజనీకాంత్​​

తమిళనాడులో పోలీసుల అమానుష చర్యలకు తండ్రీకొడుకులు బలైన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. నెటిజన్లు, సినీ ప్రముఖులు ఈ విషయంపై స్పందించి బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్​ చేస్తున్నారు. తాజాగా, సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ మృతులు జయరాజ్​, ఫెనిక్స్​ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. జయరాజ్​ భార్యతో ఫోన్​లో సంభాషించిన తలైవా.. ఆమె ఆవేదనను పంచుకున్నట్లు ట్విట్టర్​ ద్వారా తెలిపింది ఆయన బృందం.

ఇటీవలే లాక్​డౌన్​ ఆంక్షలను ఉల్లంఘించిన కారణంగా జయరాజ్​, అతని కుమారుడు ఫెనిక్స్​లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే జూన్​ 23న వారిద్దరూ మరణించారు. పోలీసులు హింసించడం వల్లే జయరాజ్​, ఫెనిక్స్​లు చనిపోయారని వారి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details