తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరో థ్రిల్లర్ చిత్రంలో రాజశేఖర్​

ప్రదీప్ కృష్ణమూర్తి అనే తమిళ దర్శకుడితో ఓ ఎమోషనల్ థ్రిల్లర్​లో నటించనున్నాడు హీరో రాజశేఖర్. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకుంది చిత్రబృందం.

By

Published : Aug 20, 2019, 5:51 AM IST

Updated : Sep 27, 2019, 2:47 PM IST

రాజశేఖర్

'పీఎస్​వీ గరుడవేగ'తో చాలాకాలం తర్వాత మళ్లీ హిట్​ అందుకున్నాడు హీరో రాజశేఖర్​. ఇటీవలే అదే ఊపుతో 'కల్కి' చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మళ్లీ మరో సినిమాను పట్టలెక్కిస్తున్నాడు. ప్రదీప్ కృష్ణమూర్తి అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఎమోషనల్ థ్రిల్లర్​గా రాబోతున్న ఈ సినిమాలో సత్యరాజ్​, నాజర్, బ్రహ్మానందం ముఖ్యపాత్రల్లో నటించనున్నారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్లు ఎవరనేది త్వరలో చెప్పనుంది చిత్రబృందం.

క్రియేటివ్ ఎంటర్​టైనర్స్​ బ్యానర్​లో నిర్మించనున్న ఈ సినిమాకు సంగీతం సైమన్ కింగ్. ప్రదీప్ కృష్ణమూర్తి ఇంతకుముందు సత్య, సైతాన్ లాంటి విజయవంతమైన తమిళ చిత్రాలతో గుర్తింపుతెచ్చుకున్నాడు.

ఇది చదవండి: ట్రైలర్: తండ్రి ఆనందం కోసం కూతురి పోరాటం

Last Updated : Sep 27, 2019, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details