మొదటి భార్య కవిత నుంచి తాను విడాకులు తీసుకోవడానికి శిల్పాశెట్టి కారణం కాదని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్కుంద్రా తెలిపారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత కవితతో విడిపోవడానికి గల కారణాన్ని ఆయన బయటపెట్టారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యవహారంపై స్పందించారు. కవితకు తన చెల్లెలి భర్తతో వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు చేశారు. దీంతో రాజ్కుంద్రా విడాకుల వ్యవహారం ప్రస్తుతం బీటౌన్లో చర్చనీయాంశమైంది.
'మొదటి భార్యతో విడాకులు.. శిల్పాశెట్టి కారణం కాదు' - శిల్పాశెట్టి రాజ్ కుంద్రా న్యూస్
తొలి భార్య కవితతో విడాకులు తీసుకోవాడనికి శిల్పాశెట్టి కారణం కాదని బిజినెస్మ్యాన్ రాజ్ కుంద్రా చెప్పారు. ఆమెకు ఉన్న వివాహేతర సంబంధమే దీనికి కారణమని అన్నారు.
'నా మొదటి భార్య కవితతో విడిపోవడానికి శిల్పాశెట్టి అస్సలు కారణం కానేకాదు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల మేమిద్దరం విడిపోయాం. కొన్నేళ్ల క్రితం మేం లండన్లో నివాసం ఉన్నాం. నా తల్లిదండ్రులతోపాటు చెల్లి, ఆమె భర్త కూడా మాతోనే ఉండేవారు. దాంతో.. కవితకు నా చెల్లెలి భర్తతో రిలేషన్షిప్ పెరిగింది. బిజినెస్ పనులపై నేను ఎప్పుడైనా టూర్కు వెళ్తే.. కవిత ప్రవర్తన మారేది. నా చెల్లెలి భర్తతో కవితకు సంబంధం ఉందని ఇంట్లో వాళ్లందరూ చెప్పారు. ఆఖరికి మా కారు డ్రైవర్ కూడా వాళ్ల గురించి అసభ్యంగా చెప్పాడు. దాంతో మా చెల్లి, ఆమె భర్తను భారత్కు పంపించేశాం. అయినా సరే కవిత అతడితో మాట్లాడడం మానలేదు. రహస్యంగా ఒక సెల్ఫోన్ను కొనుగోలు చేసి దాని నుంచి అతనికి తరచూ మెస్సేజ్లు చేసేది. ఆ ఫోన్ ఒకసారి నా కంట పడింది. అందులో ఉన్న మెస్సేజ్లు చూసి నా హృదయం ముక్కలైంది. దాంతో నేను కవిత నుంచి విడాకులు తీసుకున్నాను. అనంతరం నా జీవితంలోకి శిల్పాశెట్టి ప్రవేశించింది. నా గురించి శిల్పకు అన్ని తెలుసు. అలా, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను' అని రాజ్కుంద్రా వివరించారు.