తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్​లో టికెట్లు అమ్మిన రాశీ ఖన్నా - telugu cinema news

ప్రముఖ నటి రాశీ ఖన్నా హైదరాబాద్​లోని గోకుల్​ థియేటర్​లో సందడి చేసింది. సాయిధరమ్​ తేజ్ సరసన తను నటించిన 'ప్రతిరోజూ పండగే' సినిమా ఈ నెల 20న విడుదల కానున్న సందర్భంగా టికెట్లను అభిమానులకు విక్రయించింది.

raasi khanna sale movie tickets for her movie prathiroju pandage
థియేటర్​లో టికెట్స్​ అమ్మిన రాశి ఖన్నా

By

Published : Dec 18, 2019, 1:50 PM IST

థియేటర్​లో టికెట్స్​ అమ్మిన రాశి ఖన్నా

మెగా మేనల్లుడు సాయిధరమ్​ తేజ్‌, రాశీఖన్నా జంటగా నటిస్తోన్న చిత్రం 'ప్రతిరోజూ పండగే'. మారుతి దర్శకుడు. బన్నీ వాస్​ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా రాశీ ఖన్నా ఈ సినిమా టికెట్లను విక్రయించింది. హైదరాబాద్​లోని గోకుల్​ థియేటర్​లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ అభిమానులకు 'ప్రతిరోజూ పండగే' చిత్ర టికెట్లను అమ్మింది.

కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సాయిధరమ్​ తేజ్‌కు తాతయ్యగా సత్యరాజ్‌ నటించాడు. డిసెంబరు 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన చిత్ర ట్రైలర్, పాటలు, ఫస్ట్​లుక్​ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచాయి.

ABOUT THE AUTHOR

...view details