తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పునీత్​ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు టాలీవుడ్​ స్టార్స్​! - జేమ్స్​ మువీ

Puneeth Rajkumar last movie: గతేడాది గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ నటించిన చివరి చిత్రం 'జేమ్స్' ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను భారీగా ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. మార్చి 6న ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారని తెలిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెగాస్టార్​ చిరంజీవి, జూనియర్​ ఎన్టీఆర్ హాజరుకానున్నారని సమాచారం.

puneeth rajkumar
పునీత్​ రాజ్​కుమార్​

By

Published : Feb 26, 2022, 10:53 AM IST

Updated : Feb 26, 2022, 12:07 PM IST

Puneeth Rajkumar James movie prerelease event: కన్నడ పవర్​స్టార్ పునీత్​ రాజ్​కుమార్ నటించిన 'జేమ్స్' చిత్రం మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఆయన నటించిన చివరి సినిమా కారణంగా దీనిపై ఫ్యాన్స్​లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​ను గ్రాండ్​గా ప్లాన్​ చేస్తోంది చిత్రబృందం.

ఈ కార్యక్రమాన్ని మార్చి 6న ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా, ఈ సినిమాకు చేతన్​ కుమార్​ దర్శకత్వం వహించగా.. ప్రియా అనంద్​ హీరోయిన్​గా నటించారు.

తారక్​-పునీత్​ మధ్య మంచి స్నేహం ఉంది. గతంలో పునీత్ సినిమా కోసం ఎన్టీఆర్​ తన గాత్రాన్ని అందించారు. 'చక్రవ్యూహ' మూవీలో 'గెలయా గెలయా' అనే పాటను పాడారు. ఇక మెగాస్టార్ చిరంజీవి.. పునీత్ కుటుంబం మధ్య కూడా మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు బాగానే ఉన్నాయి.

పునీత్.. గతేడాది అక్టోబరు 29న గుండెపోటుతో మరణించారు. ఆయన మరణాన్ని ఇప్పటికీ అభిమానులు, సెలబ్రిటీలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇదీ చదవండి: షూటింగ్​ వీడియో లీక్​.. కొత్త లుక్​లో రామ్​చరణ్​!

Last Updated : Feb 26, 2022, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details