తెలంగాణ

telangana

By

Published : Jun 9, 2021, 5:32 PM IST

ETV Bharat / sitara

దిల్​రాజు దాతృత్వం.. నిత్యావసరాల పంపిణీ

కరోనా వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీకార్మికులకు తన వంతుగా సాయం చేశారు ప్రముఖ నిర్మాత దిల్​రాజు. 'కళామ్మతల్లి చేదోడు' కార్యక్రమం ద్వారా 600 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

Producer Dilraju
దిల్​రాజు

ప్రముఖ నిర్మాత దిల్​రాజు​ మంచి మనసు చాటుకున్నారు. కరోనా వల్ల పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకున్నారు. మరో ఇద్దరు నిర్మాతలు చదవాలవాడ శ్రీనివాస్ రావు, యలమంచిలి రవిచంద్​తో​ కలిసి 600మంది సినీ కార్మికులకు నెలరోజులు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. 'కళామ్మతల్లి చేదోడు' అనే పేరుతో ఈ పంపిణీ కార్యక్రమం చేశారు.

ఇటీవలే దిల్​రాజు పవన్​కల్యాణ్​ 'వకీల్​సాబ్' చిత్రాన్ని​ నిర్మించి బిగ్గెస్ట్​ హిట్​ను అందుకున్నారు. పవన్​తో మరో చిత్రాన్ని చేసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. త్వరలోనే రామ్​చరణ్​-శంకర్​ కాంబోలో రానున్న చిత్రం సహా పలు చిత్రాలను నిర్మించే పనిలో బిజీగా ఉన్నారు రాజు.

సినీకార్మికులకు నిత్యవసరాల పంపిణీ
సినీకార్మికులకు నిత్యవసరాల పంపిణీ
సినీకార్మికులకు నిత్యవసరాల పంపిణీ
సినీకార్మికులకు నిత్యవసరాల పంపిణీ

ఇదీ చూడండి:'వకీల్​సాబ్' చూస్తూ థియేటర్లో దిల్​రాజు హంగామా

ABOUT THE AUTHOR

...view details