గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. తన కొత్త బాలీవుడ్ సినిమా 'స్కై ఈజ్ పింక్' ప్రచారంలో బిజీగా ఉంది. అందులో భాగంగా నోయిడా సెక్టార్ 125లోని ఆమిటి యూనివర్సిటీలో సందడి చేసింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర దర్శకురాలు సోనాలి బోస్, సహనటుడు రోహిత్ శరఫ్తో కలిసి హాజరైంది. పాట పాడుతూ, నృత్యం చేస్తూ విద్యార్థులను ఉత్సాహపరిచింది. చాలా కాలం తర్వాత దిల్లీ వచ్చానని, ఇక్కడి వారిని కలుసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పింది.
వర్సిటీ విద్యార్థులతో కలిసి ప్రియాంక కిరాక్ డాన్స్ - హీరోయిన్ ప్రియాంక చోప్రా
హీరోయిన్ ప్రియాంక చోప్రా.. స్కై ఈజ్ పింక్ సినిమా ప్రచారంలో భాగంగా విద్యార్ధులతో కలిసి పాడుతూ, నృత్యం చేసింది. నోయిడాలోని ఆమిటి యూనివర్సిటీ ఇందుకు వేదికైంది.
![వర్సిటీ విద్యార్థులతో కలిసి ప్రియాంక కిరాక్ డాన్స్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4621064-1016-4621064-1569992998234.jpg)
విద్యార్ధులతో కలిసి ప్రియాంక ఆట పాట
ఆమిటి యూనివర్సిటీలో ప్రచారం చేస్తున్న ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో దాదాపు మూడేళ్ల తర్వాత ప్రియాంక కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్, జైరా వాసీం ఇతర పాత్రలు పోషించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి:సినిమా చూసి నిక్ ఏడ్చేశాడు: హీరోయిన్ ప్రియాంక చోప్రా
Last Updated : Oct 2, 2019, 8:46 PM IST