తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రస్థానం' హిందీ రీమేక్​లో సంజయ్ దత్..! - దత్

ప్రస్థానం హిందీ రీమేక్​లో సంజయ్ దత్ నటించనున్నాడు. ఈ చిత్రంలో మనీషా కోయిరాలా, జాకీష్రాఫ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. మాతృకను తెరకెక్కించిన దేవా కట్టానే ఈ సినిమాకు దర్శకుడు.

సంజయ్ దత్- జాకీ ష్రాఫ్

By

Published : Apr 17, 2019, 9:22 PM IST

తెలుగులో ఘన విజయం సాధించిన 'ప్రస్థానం' సినిమా హిందీలో రీమేక్ కాబోతుంది. ఈ చిత్రంలో సంజయ్ దత్​ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ఈ విషయాన్ని ధ్రువీకరించాడు దర్శకుడు దేవాకట్టా. 2010లో విడుదలైన ప్రస్థానం సినిమాలో సాయి కుమార్, శర్వానంద్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. పొలిటికల్ ​థ్రిల్లర్​గా తెరకెక్కిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది.

"సంజయ్ దత్ ప్రస్థానం రీమేక్ చేద్దామని 2011లోనే నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు వీలుపడలేదు. ప్రస్తుతం సంజయ్ సతీమణి మాన్యతా దత్ ఈ చిత్రాన్ని తీయడానికి ముందుకొచ్చారు. ప్రస్థానం కథలో మార్పులేమి చేయట్లేదు " - దేవా కట్టా, దర్శకుడు.

ఈ రీమేక్​లో జాకీ ష్రాఫ్, మనీషా కోయిరాలా, అలీ ఫజల్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రస్థానం హిందీ రీమేక్​ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆటోనగర్ సూర్య, వెన్నెల లాంటి చిత్రాలతో దర్శకుడిగాగుర్తింపు తెచ్చుకున్నాడు దేవా కట్టా. ప్రస్తుతం నెట్​ఫ్లిక్స్​తో కలిసి బాహుబలి ప్రీక్వెల్ శివగామి సిరీస్​కు సహదర్శకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details