తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అజయ్​​తో 'అత్తారింటికి దారేది' హీరోయిన్

బావ, అత్తారింటికి దారేది సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్​ ప్రణీత బాలీవుడ్ ఛాన్స్ కొట్టేసింది. అజయ్ దేవగణ్ నటిస్తున్న 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో నటించనుంది.

By

Published : Apr 6, 2019, 4:36 PM IST

అజయ్

అజయ్ దేవగణ్ నటిస్తున్న చిత్రం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'. సంజయ్ దత్, రానా, పరిణితి చోప్రా, సోనాక్షి సిన్హా లాంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాలో మరో దక్షిణాది తార చేరింది. బావ, అత్తారింటికి దారేది చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత సుభాష్ ఈ సినిమాలో నటించనుంది.

1971 ఇండో- పాక్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ విజయ్ కర్ణిక్ పాత్రను పోషిస్తున్నాడు అజయ్. వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్న ఈ సినిమా 2020 ఆగస్టు 14న విడుదల కానుంది. అభిషేక్ ఈ చిత్రానికి దర్శకుడు. క్రిషన్ కుమార్, వజీర్ సింగ్ సహనిర్మాతలు.

ABOUT THE AUTHOR

...view details