తెలంగాణ

telangana

By

Published : Jul 19, 2020, 7:53 AM IST

ETV Bharat / sitara

ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ సినిమా కొత్త కబురు నేడే

హీరో ప్రభాస్​- దర్శకుడు నాగ్​ అశ్విన్​ కాంబినేషన్​లో రానున్న సినిమా నుంచి నేడు(జులై 19న) ఓ సర్​ప్రైజ్​ రానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది. ప్రస్తుతం డార్లింగ్​ 'రాధే శ్యామ్'​లో నటిస్తున్నాడు.

prabhas
ప్రభాస్​

ప్రభాస్​-నాగ్​ అశ్విన్​ కాంబోలో రానున్న సినిమాకి సంబంధించి.. ప్రి విజువలైజేషన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న సినిమా కావడం వల్ల అందుకు సంబంధించిన పనుల్ని ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో.. నాగ్‌ అశ్విన్‌, ఆయన బృందం బిజీ బిజీగా ఉన్నారు.

అయితే జులై 19 (ఆదివారం) ఈ సినిమాకి సంబంధించిన ఓ కొత్త విషయాన్ని చెప్పనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్​ సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు పెట్టింది. దీనిపై సినీప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో పాటు కథానాయిక ఎంపికపై దృష్టి పెట్టారు నాగ్‌ అశ్విన్‌. ఓ బాలీవుడ్‌ నాయిక ఈ సినిమాలో మెరవబోతున్నట్టు టాక్​.

సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్‌ ఘట్టాలతో ఈ చిత్రాన్ని ఆరంభిస్తారని సమాచారం.

ప్రస్తుతం 'రాధే శ్యామ్‌'తో నటిస్తున్నాడు ప్రభాస్​. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్​లుక్ అభిమానులను​ విపరీతంగా ఆకట్టుకుంది.

ఇది చూడండి : ప్రేక్షకులు ఇది విన్నారా.. ట్రైలర్ చూడాలంటే 25 రూపాయలట!

ABOUT THE AUTHOR

...view details