తెలంగాణ

telangana

By

Published : Nov 10, 2019, 8:24 AM IST

ETV Bharat / sitara

ప్రభాస్ 'జాన్' సెట్స్​పైకి వెళ్లేది అప్పుడే..!

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా నటించబోయే చిత్రం 'జాన్'. ఈ సినిమాను ఈ నెలలోనే పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.

జాన్

'సాహో' తర్వాత ప్రభాస్‌ ఎలాంటి చిత్రంలో నటించనున్నాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ 'జాన్‌' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఈ నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

ఈ చిత్రంలో ప్రభాస్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంగా వస్తున్న సినిమాను కృష్ణంరాజు స్వంత సంస్థ అయిన గోపీకృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

దర్శకుడు రాధాకృష్ణ 'అనుకోకుండా ఒకరోజు' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అనంతరం ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్​గా రాణించాడు. గోపీచంద్‌ హీరోగా 'జిల్‌' అనే చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించి మెప్పించాడు.

ఇవీ చూడండి.. సీక్వెల్ లేదా ప్రీక్వెల్.. మళ్లీ 'ఇస్మార్ట్​' పక్కా

ABOUT THE AUTHOR

...view details