తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎనిమిదేళ్ల తర్వాత పవన్​కల్యాణ్ డబుల్​ బొనాంజా! - సినిమా వార్తలు

కథానాయకుడు పవన్​​ నటిస్తున్న కొత్త సినిమాలు రెండు, ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ఇదే జరిగితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత డబుల్ బొనాంజా ఇచ్చినట్లవుతుంది.

ఎనిమిదేళ్ల తర్వాత పవన్​కల్యాణ్ డబుల్​ బొనాంజా!
పవర్​స్టార్ పవన్ కల్యాణ్

By

Published : Mar 9, 2020, 10:52 AM IST

రీఎంట్రీలో పవర్​స్టార్ పవన్ కల్యాణ్​ జోరు చూపిస్తున్నాడు. మూడు సినిమాలు ఒప్పుకొని, వాటిలో రెండింటికి సంబంధించి షూటింగ్​ల్లో పాల్గొంటున్నాడు. వాటిలో ఒకటి 'వకీల్​సాబ్'.. రెండోది క్రిష్​తో చేస్తున్నాడు. అయితే ఈ రెండు చిత్రాలు ఈఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వకీల్​సాబ్ సినిమాలో పవన్​కల్యాణ్

'పింక్' రీమేక్​గా రూపొందిస్తున్న 'వకీల్​సాబ్'లో లాయర్​గా కనిపించనున్నాడు పవన్. ఈ సినిమా వేసవిలో రానుంది. క్రిష్ తీస్తున్న చిత్రం చారిత్రక కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. అయితే దీపావళి కానుకగా ఈ ప్రాజెక్టును థియేటర్లలోకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు. ఇదే నిజమైతే ఎనిమిదేళ్ల తర్వాత ఒకే ఏడాదిలో పవన్ రెండు​ సినిమాలు వచ్చినట్లవుతుంది.

గతంలో 1998లో తొలిప్రేమ, సుస్వాగతం.. 2006లో అన్నవరం, బంగారం.. 2011లో తీన్​మార్, పంజా.. 2012లో గబ్బర్ సింగ్, కెమెరామెన్ గంగాతో రాంబాబు చిత్రాల్ని విడుదల చేశాడు పవన్.

ఇదీ చదవండి: ఆ షాట్​లో పవన్​ లుక్​లో ఉన్నది హరీశ్​ ఆ!

ABOUT THE AUTHOR

...view details