తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దిశా ఈజ్ బ్యాక్​.. మళ్లీ జిమ్​లో కసరత్తులు

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఫిట్​నెస్​కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. 'భారత్' సినిమా షూటింగ్​లో గాయపడిన ఈ భామ తిరిగి జిమ్​లో కసరత్తులు ప్రారంభించి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

By

Published : Aug 3, 2019, 2:00 PM IST

దిశా పటానీ

'భారత్' సినిమా షూటింగ్​లో జిమ్నాస్టిక్స్​ చేస్తూ గాయపడింది బాలీవుడ్ భామ దిశా పటానీ. ఈ ఘటనలో మోకాలి గాయంతో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంది. ప్రస్తుతం గాయం తగ్గి ట్రైనర్​ సహాయంతో తిరిగి కసరత్తులు ప్రారంభించింది. ఈ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది.

శిక్షకుడి సహాయంతో ఫ్రంట్​ ఫ్లిప్ చేస్తున్న వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది దిశా. "భారత్ సినిమా సెట్​లో గాయపడ్డాక, ఈ వర్కవుట్స్ నా మెుదటి ప్రయత్నం" అని రాసుకొచ్చింది.

దిశా పటానీ ఇన్​స్టాలో పంచుకున్న వీడియో

ప్రస్తుతం ఆదిత్య రాయ్​ కపూర్​ సరసన 'మలంగ్'లో నటించనుంది దిశా. మోహిత్ సూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో భారీ విన్యాసాలను ప్రదర్శించనుందీ భామ.మారిషస్, గోవాలో రొమాంటిక్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇప్పటికే సహనటుడు ఆదిత్యతో కలిసి సినిమాలో కఠినమైన స్టంట్స్ ప్రదర్శించడానికి ఈతలో శిక్షణ పొందిందీ బాలీవుడ్​ భామ.

ఇది సంగతి: 'పవర్​స్టార్​ అడిగారని ఆ టైటిల్​ ఇచ్చేశాం'

ABOUT THE AUTHOR

...view details