లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'(Ponniyin Selvan). 2019 డిసెంబర్లో థాయ్లాండ్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కబోతోందని.. మొదటి భాగాన్ని 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించింది.
మణిరత్నం భారీ బడ్జెట్ సినిమా విడుదల ఎప్పుడంటే.. - Ponniyin Selvan part 2
మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ వంటి స్టార్ నటులు నటిస్తోన్న చిత్రం పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం.
పొన్నియన్ సెల్వన్
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జయరామ్, శోభిత ధూళిపాళ్ల, శరత్ కుమార్, ప్రకాశ్రాజ్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.