తెలంగాణ

telangana

By

Published : Sep 8, 2020, 7:59 PM IST

Updated : Sep 8, 2020, 8:06 PM IST

ETV Bharat / sitara

'అది నిజమైతే ముంబయి వదిలి వెళ్లిపోతా'

కంగనా రనౌత్​ మాదక ద్రవ్యాలు తీసుకుంటుందని మహారాష్ట్ర హో మంత్రి అనిల్ దేశ్​ముఖ్ ఆరోపించారు. దీనిపై కంగన స్పందిస్తూ ఈ విషయంలో విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించడానికి సిద్ధమని తెలిపింది.

Kangana
కంగన

బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ.. మహారాష్ట్ర హోం మంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ మంగళవారం విచారణకు ఆదేశించారు. ఈ విషయంపై స్పందించిన కంగన.. ప్రభుత్వానికి, పోలీసులకు సహకరిస్తానని తెలిపింది.

"ఈ విచారణకు నేను అంగీకరిస్తున్నా. నాకు డ్రగ్​ టెస్టులు చేయండి. ఒకవేళ మీకేమైన మాదక ద్రవ్య వ్యాపారులకు సంబంధించిన క్లూస్​ దొరికితే.. నా కాల్​ రికార్డును కూడా చెక్​ చేసుకోండి. ఒకవేళ అది నిజమైతే.. నా తప్పును అంగీకరించి పూర్తిగా ముంబయిని వదిలి వెళ్లిపోతా."

కంగనా రనౌత్​, సినీ నటి

ఇటీవలే నటుడు శేఖర్​ సుమన్​ కుమారుడు అధ్యాయన్​ సుమన్​.. కంగన డ్రగ్స్​ తీసుకున్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే హోంమంత్రి విచారణకు ఆదేశించారు. మరోవైపు 'పంగా' నటి మాదకద్రవ్యాలు ఉపయోగించినట్లు ఒప్పుకోవాలని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి సచిన్​ సావంత్​ డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్రం దర్యాప్తు చేపట్టి.. ఆమె వెనక దాగున్న డ్రగ్​ ముఠాను వెలికితీయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Last Updated : Sep 8, 2020, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details