తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్‌, ప్రభాస్‌, వెంకీ.. అందరూ ఆరోజేనట..!

స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, ప్రభాస్, వెంకటేశ్​ ఒకేరోజు తమ చిత్రాలను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత వీరు ముగ్గురు తమతమ సినిమా సెట్లలో అడుగుపెట్టనున్నారట.

By

Published : Jan 10, 2020, 6:01 AM IST

pawan
పవన్

ఈ కొత్త ఏడాదిలో సినీప్రియుల కోసం తెలుగు చిత్రసీమ కొత్త రుచులను సిద్ధం చేస్తోంది. వీటిలో పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం 'పింక్‌' రీమేక్‌, 'సాహో' తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ చేస్తోన్న 'జాన్', విక్టరీ వెంకటేశ్​ చేయబోయే 'అసురన్‌' రీమేక్‌ వంటి క్రేజీ ప్రాజెక్టులున్నాయి. తాజాగా ఈ మూడు చిత్రాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకొచ్చింది.

ఈ సినిమాలన్నీ సంక్రాంతి తర్వాత ఒకే రోజు సెట్స్‌పైకి వెళ్లబోతున్నాయట. ఇంతకీ అదెప్పుడో కాదు.. జనవరి 20నే. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కబోయే 'అసురన్‌' రీమేక్‌ను ఈనెల 20 నుంచి అనంతపురం జిల్లాలో చిత్రీకరించబోతున్నారట. కథ రీత్యా ఈ సినిమాలో అత్యధిక భాగాన్ని రాయలసీమ ప్రాంతంలోనే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఇక అదే రోజున హైదరాబాద్‌లో పవన్‌, ప్రభాస్‌లు కూడా సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి చిత్రాల కోసం ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్లు రూపొందించారు. పవన్‌.. 'పింక్‌' రీమేక్‌ కోసం లాయర్‌గా ఈ 20నే కోర్టు హాల్‌లో అడుగుపెట్టనుండగా.. అదే రోజు ప్రభాస్‌ తన 20వ చిత్రం 'జాన్' కోసం యూరోప్‌ సెట్లోకి వెళ్లబోతున్నాడట.

ఇవీ చూడండి.. 2019లో కలిసొచ్చారు.. 2020లో పోటీ పడుతున్నారు

ABOUT THE AUTHOR

...view details