ఒకరు పవర్స్టార్(pawan kalyan news).. ఒకరు సూపర్స్టార్.. మరొకరు యంగ్ టైగర్.. ఈ ముగ్గురు స్టార్ హీరోలు కలిసి ఒకే వేదికపై కనిపిస్తే.. ఆ ఊహే ఎంతో అద్భుతంగా ఉంది కదూ!.. మరికొద్ది రోజుల్లో ఇది నిజం కాబోతుందని తెలుస్తోంది.
ఒకే ఫ్రేమ్లో పవన్, మహేశ్, తారక్.. నిజమెంత? - తారక్ మహేశ్ బాబు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR news) వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Kotiswarulu news). ఈ షోలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. అయితే ఈ కార్యక్రమంలో తారక్, మహేశ్తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా కనిపిస్తారట. అదెలాగంటే?
![ఒకే ఫ్రేమ్లో పవన్, మహేశ్, తారక్.. నిజమెంత? pawan kalyan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13691090-665-13691090-1637421685314.jpg)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR news) వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్ షో 'ఎవరు మీలో కోటీశ్వరులు'(Evaru Meelo Kotiswarulu news). మధ్యతరగతి వారి కలలను సాకారం చేయడం సహా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ గేమ్ షోలో సూపర్స్టార్ మహేశ్బాబు (mahesh babu meelo evaru koteeswarudu date) సందడి చేశారు. ఎన్టీఆర్ అడిగిన ప్రశ్నలకు ఫుల్ జోష్గా సమాధానాలు ఇచ్చారు. మరి పవన్ కల్యాణ్(pawan kalyan news) ఏం చేశారని మీ అనుమానమా?.. ఈ షోలో ఓ ప్రశ్నకు 'వీడియోకాల్ ఏ ఫ్రెండ్' లైఫ్లైన్ను ఎంచుకున్న మహేశ్.. ఆ సమయంలో పవన్కు ఫోన్ చేస్తారని సమాచారం. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇదే నిజమైతే ఒకే ఫ్రేములో ముగ్గురు స్టార్ హీరోలు కనిపించడం ఖాయం.
తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ గేమ్ షోలో ఇప్పటివరకు పలువురు స్టార్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని వాళ్లందరూ ఏదో ఒక స్వచ్ఛంద సంస్థకు విరాళం అందించారు. ప్రారంభ ఎపిసోడ్లో రామ్చరణ్ పాల్గొని అలరించారు. రాజమౌళి, కొరటాల శివ, దేవిశ్రీ ప్రసాద్, తమన్, సమంతలు కూడా ఈ స్టేజ్పై తళుక్కున మెరిసి.. ఎన్టీఆర్ ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో మహేశ్ ఎపిసోడ్ (Mahesh Babu NTR) ప్రసారం కానున్న తరుణంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.