తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాప్​ గేర్​లో పవన్​.. 30 రోజుల్లో మూడో సినిమా ప్రకటన - ENTERTAINMENT NEWS

పునరాగమనంలో మూడో సినిమాను ప్రకటించేశాడు పవర్​స్టార్ పవన్ కల్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు హరీశ్ శంకర్​తో మరోసారి కలిసి పనిచేయనున్నాడు.

టాప్​ గేర్​లో పవన్​.. 30 రోజుల్లో మూడో సినిమా ప్రకటన
పవన్​కల్యాణ్-హరీశ్ శంకర్

By

Published : Feb 1, 2020, 12:33 PM IST

Updated : Feb 28, 2020, 6:36 PM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​ అసలు తగ్గట్లేదు. సినిమాల్లోకి ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన ఇతడు.. 'పింక్​' రీమేక్, క్రిష్​ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాకు సంతకం చేసేశాడు. దర్శకుడు హరీశ్ శంకర్​తో మరోసారి పవన్​ పనిచేయనున్నట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. పవర్​స్టార్.. గత 30 రోజుల్లో ప్రకటించిన మూడో సినిమా ఇది కావడం విశేషం.​

హరీశ్ శంకర్-పవన్​కల్యాణ్​ కాంబినేషన్​లో ఇప్పటికే 'గబ్బర్​సింగ్' వంటి బ్లాక్​బస్టర్ వచ్చింది. మరి ఇప్పుడు రాబోయే సినిమా ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.

గత మూడేళ్లుగా తమ హీరో వెండితెరపై కనిపించక నిరాశపడిన అభిమానులు.. ఈ ప్రకటనలతో అప్పుడే పండగ చేసుకుంటున్నారు.

Last Updated : Feb 28, 2020, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details