అభిర్సేన్ గుప్తా దర్శకత్వంలో ఆదా శర్మ కథానాయికగా నటించిన కామెడీ డ్రామా వెబ్ సిరీస్ చిత్రం 'పతి పత్ని ఔర్ పంగ'. దీనికి సంబంధించిన ట్రైలర్ ఈరోజే విడుదలైంది. అనుశ్రీ అబీర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో నవీన్ కస్తూరియా, ఆదా శర్మలు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్ర కథేంటంటే చిన్న చిన్న పనులు చేస్తూ మధ్యవర్తిత్వం చేసే రోమన్చక్ (నవీన్ కస్తూరియా) ఎప్పుడు నిరాశగా జీవితం గడుపుతుంటాడు. తన జీవితం కొత్త పుంతలు తొక్కాలని కోరుకుంటాడు. కానీ శివానీ భట్నాకర్ (ఆదా శర్మ)ను వివాహం చేసుకోవడంతో జీవితం మారిపోతుంది.