తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2020, 8:01 PM IST

ETV Bharat / sitara

నవ్వులు పూయిస్తోన్న'పతి పత్ని ఔర్‌ పంగ' ట్రైలర్

ఆదాశర్మ నటించిన 'పతి పత్ని ఔర్ పంగ' వెబ్ సిరీస్ చిత్రం ట్రైలర్​ నవ్వులు పూయిస్తోంది. డిసెంబర్​ 11న ఈ వెబ్‌సిరీస్‌ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ వేదికగా విడుదల కానుందని చిత్ర యూనిట్ పేర్కొంది.

pati patni aur panga
నవ్వులు పూయిస్తోన్న 'పతి పత్ని ఔర్‌ పంగ' ట్రైలర్

అభిర్‌సేన్‌ గుప్తా దర్శకత్వంలో ఆదా శర్మ కథానాయికగా నటించిన కామెడీ డ్రామా వెబ్ సిరీస్ చిత్రం 'పతి పత్ని ఔర్‌ పంగ‌'. దీనికి సంబంధించిన ట్రైలర్‌ ఈరోజే విడుదలైంది. అనుశ్రీ అబీర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్​ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో నవీన్‌ కస్తూరియా, ఆదా శర్మలు ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్ర కథేంటంటే చిన్న చిన్న పనులు చేస్తూ మధ్యవర్తిత్వం చేసే రోమన్‌చక్‌ (నవీన్‌ కస్తూరియా) ఎప్పుడు నిరాశగా జీవితం గడుపుతుంటాడు. తన జీవితం కొత్త పుంతలు తొక్కాలని కోరుకుంటాడు. కానీ శివానీ భట్నాకర్‌ (ఆదా శర్మ)ను వివాహం చేసుకోవడంతో జీవితం మారిపోతుంది.

ఆ తర్వాత రోమన్‌చక్‌ తను చేసుకున్నది ఓ అమ్మాయిని కాదని తెలుసుకుంటాడు. తదనంతరం తన జీవితంలో వచ్చిన మార్పులు తెలియాలంటే కచ్చితంగా చిత్రం చూడాల్సిందే. ఇంకా చిత్రంలో హిటెన్‌ తేజ్వాని, గురుప్రీత్ సైనీ, అల్కా అమిన్ తదితరులు నటించారు. ఈ వెబ్‌సిరీస్‌ చిత్రం డిసెంబర్‌ 11న ఎమ్‌ఎక్స్ ప్లేయర్లో విడుదల కానుంది.

ఇదీ చదవండి:కంగన.. మాతో పెట్టుకోవద్దు: మికా సింగ్‌

ABOUT THE AUTHOR

...view details