తెలంగాణ

telangana

By

Published : Aug 7, 2020, 9:02 AM IST

ETV Bharat / sitara

కరోనా కాలంలో పరుచూరి ఇంట విషాదం

ప్ర‌ముఖ‌ రచయిత, న‌టుడు పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి క‌న్నుమూశారు. ఆయన భార్య విజయలక్ష్మి (74) శుక్రవారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో మృతి చెందారు.

paruchuri wife news
కరోనా కాలంలో పరుచూరి ఇంట విషాదం

టాలీవుడ్ ప్ర‌ముఖ ర‌చ‌యిత ప‌రుచూరి వెంకటేశ్వరరావు ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌ల‌క్ష్మి(74) శుక్ర‌వారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. విజయలక్ష్మి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియ‌జేశారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నారు.

సీనియర్​ ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ‌, శోభ‌న్‌బాబు, కృష్ణంరాజు,చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ స‌హా ప‌లువురు అగ్ర క‌థానాయ‌కులంద‌రి సినిమాల‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్(ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌) రచయతలుగా పని చేశారు.

ABOUT THE AUTHOR

...view details