తెలంగాణ

telangana

By

Published : May 4, 2021, 5:18 PM IST

ETV Bharat / sitara

కరోనాతో ఆ హీరోయిన్ల ఇళ్లలో విషాదం

హీరోయిన్లు నిక్కీ తంబోలి, పియా బాజ్​పేయీ ఇళ్లలో విషాదం చోటుచేసుకుంది. ఈ కథానాయికల సోదరులు కరోనాతో మృతి చెందారు.

nikki tamboli, piya bajpayee
నిక్కీ తంబోలి, పియా బాజ్​పేయీ

కరోనా.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎందరినో బలితీసుకుంటోంది. ఆక్సిజన్​ దొరక్క కొందరు.. సరైన చికిత్స అందక మరి కొందరు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు మరో ఇద్దరు హీరోయిన్ల ఇళ్లలో విషాదం నెలకొంది. కథానాయికలు నిక్కీ తంబోలి, పియా బాజ్​పేయీ సోదరులు కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ​

తెలుగులో శ్రీవిష్ణు నటించిన 'తిప్పరా మీసం'తో హీరోయిన్​గా పరిచయమైంది నిక్కీ తంబోలి. తన సోదరుడు వైరస్​ సోకి తుదిశ్వాస విడిచాడని సోషల్​మీడియా ద్వారా తెలుపుతూ భావోద్వేగానికి గురైంది. కాగా, ఇప్పటికే అతడికి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు కూడా వెల్లడించింది. 'చీకటి గదిలో చితకొట్టుడు', 'కాంచన 3' సినిమాల్లో నటించింది నిక్కీ.

నిక్కీ తంబోలి భావోద్వేగం

'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పియా బాజ్​పేయీ(ఉత్తరప్రదేశ్​). ఈమె సోదరుడు వెంటిలేటర్​ చికిత్స అందకపోవడం వల్ల చనిపోయాడు. ఈ విషయాన్ని సోషల్​మీడియా ద్వారా తెలిపింది బాయ్​పేయీ. తన సోదరుడికి అత్యవసరంగా వెంటిలేటర్​ సాయం కావాలని.. బెడ్​ దొరకడం లేదని సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకుందీ నటి. ఈ పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే అతడు చనిపోయాడంటూ భావోద్వేగానికి గురైంది.

ఇదీ చూడండి:'రంగం' నటి ఇప్పుడెలా ఉందో చూశారా?

ఇదీ చూడండి: హాట్ హాట్​గా నిక్కీ తంబోలి

ABOUT THE AUTHOR

...view details