ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల కోసం భారత్ నుంచి 'షేమ్లెస్' అనే ఓ లఘుచిత్రం నామినేట్ అయింది. లైవ్ యాక్షన్ కేటగిరీలో ఇది పోటీపడుతోంది. అకాడమీ అవార్డుల రేసులో నిలిచినందుకు ఈ సినిమా దర్శకుడు కేయిత్ గోమ్స్ హర్షం వ్యక్తం చేశాడు. తన చిత్ర బృందానికి కృతజ్ఞతలు చెప్పాడు.
"ఈ ప్రత్యేక సందర్భంలో నా సినిమా నటీనటులకు, సిబ్బందికి నేను ధన్యవాదాలు చెప్పాలి. నా కుటుంబం, స్నేహితులు చేసిన ధనసాయంతో నేను సినిమాలు తీస్తుంటాను. వాళ్లంతా ప్రేమ, ఆసక్తితో నాతో కలిసి వస్తారు. అంతకంటే మరింత ఆశీర్వాదం ఇంకేం లేదు."
--కేయిత్ గోమ్స్, 'షేమ్లెస్' లఘుచిత్ర దర్శకుడు