బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మరణం సినీ లోకాన్ని విస్మయానికి గురిచేసింది. ధోనీ బయోపిక్తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ యువ హీరో.. ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆయన అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా అతడికి నివాళుర్పించారు.
సాండ్ ఆర్ట్తో హీరో సుశాంత్ సింగ్కు నివాళి - sushanth singh rajput tribute
సాండ్ ఆర్ట్తో హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ బొమ్మ రూపొందించిన ప్రముఖ సైకత శిల్పి మానస్ సాహో, అతడి మృతిపై నివాళులర్పించారు.
సాండ్ ఆర్ట్తో సుశాంత్కు సైకత శిల్పి నివాళి
ఈ క్రమంలోనే ప్రముఖ సైకత శిల్పి మానస్ సాహో.. సుశాంత్ సాండ్ ఆర్ట్తో ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూరి బీచ్లో మూడు గంటల పాటు శ్రమించి అతడి బొమ్మను రూపొందించారు. 'నువ్వు ఎల్లప్పుడూ మాతోనే ఉంటావు' అంటూ రాసుకొచ్చారు.
Last Updated : Jun 15, 2020, 8:33 AM IST