బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐ విచారిస్తోంది. మరోవైపు అతడి సోదరి శ్వేతా సింగ్, సుశాంత్ జ్ఞాపకార్థంగా 'ప్లాంట్స్4ఎస్ఎస్ఆర్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా అభిమానులందరూ లక్షకుపైగా మొక్కల్ని నాటనున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను శ్వేత ట్వీట్ చేశారు.
సుశాంత్ జ్ఞాపకార్థంగా లక్షకుపైగా మొక్కలు - సుశాంత్ సింగ్ వార్తలు
తన సోదరుడు సుశాంత్ సింగ్ జ్ఞాపకార్థంగా ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్వేతా సింగ్. ఆ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
![సుశాంత్ జ్ఞాపకార్థంగా లక్షకుపైగా మొక్కలు #Plants4SSR: More than one lakh trees in remembrance of Sushant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8794769-694-8794769-1600071759904.jpg)
Sushant singh
జూన్ 14న ముంబయి బాంద్రాలోని తన సొంత ఫ్లాట్లో ఉరి వేసుకుని చనిపోయాడు సుశాంత్. దీనికి నెపోటిజమ్ అని తొలుత ఆరోపణలు వచ్చాయి కానీ తర్వాత ప్రేయసి రియా చక్రవర్తే అతడి మృతికి కారణమంటూ నటుడి తండ్రి కేసు పెట్టారు. అనంతరం కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
Last Updated : Sep 14, 2020, 2:23 PM IST