తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రానాతో రొమాన్స్​కు పరిణీతి నో - Parineeti Chopra

బాలీవుడ్ నటుడు అజయ్‌ దేవగణ్‌, సోనాక్షి సిన్హా, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న చిత్రం 'భుజ్: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా'. ఈ చిత్రంలో పరిణీతి చోప్రా మరో కథానాయికగా ఎంపికైందని వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా పరిణీతి బదులుగా ప్రత్యేక గీతాల నటి నోరా ఫతేహిని తీసుకున్నట్లు సమాచారం.

Nora Fatehi Replaces Parineeti Chopra to Romance with Rana in  Bhuj The Pride Of India
రానాతో రొమాన్స్​కు పరిణీతి నో

By

Published : Jan 5, 2020, 5:26 AM IST

Updated : Jan 5, 2020, 8:15 AM IST

ప్రముఖ నటీనటులు అజయ్‌ దేవగణ్‌, సంజయ్​ దత్​, సోనాక్షి సిన్హా, రానా దగ్గుబాటి కలిసి 'భుజ్: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా' సినిమాలో నటిస్తున్నారు. దేశభక్తి ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్​తో తెరకెక్కించనున్నారు. అయితే ఇందులో మరో కథానాయికగా పరిణీతి చోప్రా నటిస్తోందని మొదట వార్తలు వచ్చాయి.

పరిణీతి ప్రస్తుతం.. వేరే చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుందట. ఆమె స్థానంలోనే నోరా ఫతేహిని తీసుకోనున్నారని సమాచారం. ఈ నెల 12 నుంచి ఈ అమ్మడు షూటింగ్​లో పాల్గొననుందట. ఇందులో అమ్మీ విర్క్​, ప్రణీత కూడా కీలకపాత్రల్లో నటించనున్నారు. అభిషేక్‌ దూనియా దర్శకత్వం వహిస్తున్నాడు.

ఐటం సాంగ్​లతో ఫేమస్​..

2014లో 'రోర్: టైగర్స్‌ ఆఫ్‌ సుందర్‌బన్స్‌' చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైంది నోరా ఫతేహీ. ఆ తర్వాత అనేక ప్రత్యేక గీతాల్లో సందడి చేసింది. తెలుగులో 'టెంపర్‌', 'బాహుబలి: ది బిగినింగ్‌', 'షేర్‌', 'లోఫర్‌' తదితర చిత్రాల్లో ఐటం సాంగ్​లతో అలరించింది. ఇటీవల నోరా నటించిన 'బాట్లా హౌస్‌'లోని రీమిక్స్‌ గీతం 'ఓ సాకీ సాకీ..'కు విపరీతమైన ఆదరణ లభించింది.

Last Updated : Jan 5, 2020, 8:15 AM IST

ABOUT THE AUTHOR

...view details