తెలంగాణ

telangana

By

Published : Dec 4, 2019, 10:53 PM IST

ETV Bharat / sitara

ట్రైలర్​: ఈసారి 'జేమ్స్​బాండ్' మిషన్​ చాలా డేంజర్

జేమ్స్​బాండ్ సినిమా 'నో టైమ్ టు డై' ట్రైలర్..  ఆకట్టుకునే యాక్షన్ సీన్లతో అంచనాల్ని పెంచుతోంది. ఇందులో ఆస్కార్ విజేత రమీ మాలిక్ విలన్​గా నటిస్తుండటం విశేషం.

'నో టైమ్ టు డై' ట్రైలర్
'నో టైమ్ టు డై' ట్రైలర్

జేమ్స్ బాండ్ సిరీస్​లోని 25వ సినిమా 'నో టైమ్ టు డై'. బుధవారం ట్రైల‌ర్​ను విడుదల చేశారు. హీరోగా డేనియల్ క్రెగ్ నటించాడు. అతడు చేసిన యాక్షన్ సీన్లు అలరిస్తున్నాయి. గత చిత్రాలకంటే స్టయిల్​, స్టన్నింగ్​ లుక్​తో ఆకట్టుకుంటున్నాడీ నటుడు.

ఆస్కార్ విజేత రమీ మాలిక్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. కారీ ఫుకునాగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను తొలుత నవంబర్​లో విడుదల చేయాలనుకున్నారు. అది సాధ్యం కాలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు. కానీ చివరకు భారత్​లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 3న, అమెరికాలో ఏప్రిల్‌ 8న, కెనడాలో ఏప్రిల్‌ 2న విడుదల కానుంది.

జమైకాలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్న బాండ్‌ను సీఐఏ మళ్లీ సహాయం కోరుతుంది. కిడ్నాప్‌ అయిన శాస్త్రవేత్తను రక్షించమని ఓ మిషన్‌ను అప్పగిస్తుంది. ఈ మిషన్‌ ఊహించిన దానికంటే మరింత క్లిష్టంగా మారడం, విలన్ల చేతిలో అతి ప్రమాదకరమైన ఆయుధాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఛేజింగ్‌లు ఈ కథలో ముఖ్యమైన అంశాలు.

ఇది చదవండి: అమ్మకానికి 'జేమ్స్​ బాండ్' ప్రత్యేక కారు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details