తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇకపై స్పెషల్​ సాంగ్స్​కు దూరంగా అనసూయ! - item songs anasuya

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పారు యాంకర్​, నటి అనసూయ భరద్వాజ్​. ఇకపై ప్రత్యేక గీతాల్లో నటించనని స్పష్టం చేశారు.

anasuya
అనసూయ

By

Published : Feb 22, 2021, 10:07 AM IST

Updated : Feb 22, 2021, 11:47 AM IST

బుల్లితెరపై యాంకర్​గా మెరిసి.. వెండితెరపై పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనసూయ భరద్వాజ్. కొన్ని ప్రత్యేక గీతాల్లోనూ నర్తించి మెప్పించారు. తాజాగా.. కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న 'చావు కబురు చల్లగా' సినిమాలో ఐటమ్​ సాంగ్​లో చిందేశారు అనసూయ. దీంతో రాబోయే మరికొన్ని సినిమాల్లోనూ ఆమె స్పెష‌ల్ సాంగ్స్ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

దీనిపై స్పందించిన అన‌సూయ‌.. "ఇకపై ఎలాంటి స్పెష‌ల్ సాంగ్స్ చేయను. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రంలోని పాట‌ను నా స్నేహితుడు జానీ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశాడు. అందుకే అందులో నటించేందుకు ఆస‌క్తి చూపాను. నటనకు ప్రాధాన్యం ఇచ్చే రోల్స్​ మాత్రమే చేయాలనుకుంటున్నా," అని తెలిపారు.

త్వరలోనే అనసూయ.. 'థ్యాంక్యూ బ్ర‌ద‌ర్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతోపాటు 'రంగ‌మార్తాండ‌', 'ఖిలాడి', 'ప‌క్కా క‌మర్షియ‌ల్‌', 'పుష్ప' సహా పలు చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

ఇదీ చూడండి:'చావుకబురు చల్లగా'లో అనసూయ ఐటం సాంగ్

Last Updated : Feb 22, 2021, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details