తెలంగాణ

telangana

By

Published : Jun 8, 2019, 11:00 AM IST

ETV Bharat / sitara

అల్లు-త్రివిక్రమ్​ సినిమాలో చిత్రలహరి హీరోయిన్​

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా '#అల్లు అర్జున్​19'. పూజా హెగ్డే కథానాయిక. యువ హీరో సుశాంత్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో... రెండవ కథానాయిక పేరు వెల్లడించింది చిత్రబృందం.

అల్లు అర్జున్​కు జోడీగా చిత్రలహరి హీరోయిన్​

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలు చేస్తూ జోరు మీదున్నాడు. త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న '#అల్లు అర్జున్ 19' హైదరాబాద్​లో ఇటీవలే రెండో షెడ్యూల్ ప్రారంభించుకుంది. ఈ సినిమా నుంచి మరో అప్​డేట్​ వదిలింది చిత్రయూనిట్​. ఈ చిత్రంలో రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్‌ను ఎంపిక చేసినట్లు ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది. ఈ అమ్మడు ఇటీవల చిత్రలహరి సినిమాలో సాయిధరమ్​ తేజ్​తో కలిసి నటించింది.

ఇప్పటికే నివేదా చిత్రీకరణలో పాల్గొందని.. సుశాంత్​తో కలిపి కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మరి సినిమాలో వీరిద్దరి పాత్రలేంటి? వాటి పరిధి ఎంతన్న విషయాలు తెలియాల్సి ఉంది.

సుశాంత్​, నివేదా

గీతా ఆర్ట్స్‌ - హారిక & హాసిని క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏఏ19 చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details