తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టీజర్: నిశ్శబ్దాన్ని ఛేదించే ఆ నిజం ఏంటి? - cinema vaarthalu

హారర్​ కథాంశంతో రూపొందుతోన్న 'నిశ్శబ్దం' సినిమా టీజర్​ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విడుదల చేశాడు. త్వరలో ప్రేక్షకుల మందుకు రానుందీ చిత్రం.​

నిశ్శబ్దంలో అనుష్క-మాధవన్

By

Published : Nov 6, 2019, 6:34 PM IST

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'నిశ్శబ్దం'. మాధవన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హారర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. టీజర్​ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్.. బుధవారం విడుదల చేశాడు. ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాలు పెంచుతోంది.

ఓ ప్రాంతానికి వెకేషన్​ కోసం అనుష్క-మాధవన్ వెళతారు. ఆ సమయంలో ఓ ప్రమాదం జరుగుతుంది. మాధవన్ చనిపోతాడు. ఇంతకీ అతడ్ని చంపింది ఎవరు? అక్కడ అసలేం జరిగింది? తదితర అంశాలు తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇందులో అనుష్క.. సాక్షి అనే దివ్యాంగురాలిగా నటిస్తోంది. మైకేల్ మ్యాడ్​సన్, షాలినీ పాండే, అంజలి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందించాడు. హేమంత్ మధుకర్‌ దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి కోన వెంకట్‌ నిర్మిస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'భాగమతి' వంటి హిట్‌ తర్వాత స్వీటీ నటిస్తున్న చిత్రమిది.

ఇది చదవండి: అనుష్కతో ప్రేమ-పెళ్లిపై ప్రభాస్​ క్లారిటీ..!

ABOUT THE AUTHOR

...view details