తెలంగాణ

telangana

'పెద్దన్న' వచ్చాకే 'అర్జున్ సురవరం' రిలీజ్​!

By

Published : Jul 28, 2019, 2:38 PM IST

నిఖిల్ హీరోగా నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. కొంతకాలంగా ఈ సినిమ విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదలపై స్పష్టతనిచ్చాడు నిఖిల్.

సినిమా

టాలీవుడ్ యువ హీరో నిఖిల్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'అర్జున్ సురవరం'. టీఎన్ సంతోష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా విషయంపై స్పందించాడు నిఖిల్.

గతేడాది రిలీజ్ అవ్వాల్సిన ‘అర్జున్ సురవరం’ సెప్టెంబర్​కు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. 'అర్జున్ సురవరం' రిలీజ్ గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు నిఖిల్ స్పందిస్తూ.. 'సాహో' తర్వాతే విడుదల ఉంటుందని స్పష్టం చేశాడు.

ఈ సినిమా తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ–2'‘ చేయనున్నాడు నిఖిల్. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పుర్తయింది.

నిఖిల్ ట్వీట్

ఇవీ చూడండి.. సినీ డైరీ: జేమ్స్ బాండ్​.. ఒకప్పుడు టవల్స్ దొంగ

ABOUT THE AUTHOR

...view details